శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఇద్దరికి షాక్..
శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్లు సంజనా గల్రానీ , రాగిణి ద్వివేది ప్రస్తుతం ఎన్సీబి అధికారుల కస్టడీలో ఉన్నారు.సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. మరో వైపు సంజనా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి ఫైవ్స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల్లో విక్రయించేదని ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేదికి సెప్టెంబర్ 3న సమన్లు పంపిన అధికారులు మరుసటి రోజే ఆమెను కస్టడీలోకి తీసుకొని తీసుకున్నారు.
ఇక సెప్టెంబర్ 8 న హీరోయిన్ సంజనా ఇంట్లో సోదాలు నిర్వహించారు.. ఆమె ఇంట్లో డ్రగ్స్ సంబందించిన కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ఆమెను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడకం కూడా చేస్తున్నారని తేలింది.దీంతో విచారణను ముమ్మరం చేసింది సీబీఐ.. రిమాండ్ లో ఉన్న వీరిద్దరూ కోర్టులో బెయిల్ పిటిషన్ ను వేశారు. గతంలో ఒకసారి విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పుడు మరోసారి వేసుకున్న పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది.బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎదురుచూస్తున్న వారిపై ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది. కర్ణాటకలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు బుల్లితెరను కూడా తాకింది. యాంకర్ అనుశ్రీని మంగళూరు సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.