సల్మాన్‌ఖాన్‌ రూటే వేరు.. ఏకంగా 7 దేశాలలో షూటింగ్ షురూ..!

SAVIRIGANI MANIKUMAR
బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రస్తుతం టైగర్ సిరీస్లోని మూడో చిత్రం చేస్తున్నారు. మనీశ్ శర్మ దర్శకుడు, ఆదిత్య చోప్రా నిర్మాత. ఇప్పటికే వచ్చిన 'టైగర్'‌, 'టైగర్ జిందా హై' భాక్సాఫీసు దగ్గర సందడి చేశాయి. దీంతో ఈ భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్లే చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా షూటింగ్ మొత్తం ఏడు దేశాల్లోని లోకేషన్లలో జరగనుందట. యూఏఈ, ఇస్తాంబుల్, యూఎస్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది., సెప్టెంబరు 27న చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 'టైగర్ 3' గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.  

ప్రస్తుతం 'రాధే'లో నటిస్తున్న సల్మాన్.. అది పూర్తయిన తర్వాత 'టైగర్ 3' సినిమాలో నటిస్తాడు. ఇందులోని నటీనటుల ఎవరనేది త్వరలో తెలియనుంది.బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 'టైగర్' సిరీస్లో మూడో చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ నిర్మాణసంస్థ యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారట. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటించనుంది.సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. హీరోయిన్గా దిశా పటానీ నటిస్తుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఇందుకోసం ముంబయిలోని మెహబూబ్ స్టూడియోలో షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కోరినట్లు సమాచారం.  కరోనా విరామ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. వ్యవసాయం చేస్తూ.. ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను  తన సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.  వీడియోలో పింక్ టీ-షర్ట్, నల్లని షాట్ వేసుకుని ట్రాక్టర్తో పొలం దున్నుతున్నాడు సల్మాన్. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫొటో, వీడియోలకు 13 లక్షల వీక్షణలు లభించాయి. రైతులందరికీ గౌరవంగా ఇంతకు ముందు ఓ పోస్ట్ను వారికి అంకితం చేశాడు భాయ్జాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: