చివరికి వీడనున్న సుశాంత్ డెత్ మిస్టరీ..? పోలీసులు అతనిని లాక్ చేసేశారు

Arun Showri Endluri
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' అటు ఓటిటి రికార్డులను తిరగబెడుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కువమంది వీక్షించిన ఓటిటి వీడియో గా చరిత్ర నెలకొల్పింది. అయితే ఈ ప్రజాదరణ, ప్రశంసలు ఏవీ సుశాంత్ ఆత్మకు శాంతి చేకూర్చలేవు. అతని చావుకు కారకులైన వారికి తగిన శిక్ష పడేవరకు సుశాంత్ మరణానికి న్యాయం జరగదు. అయితే ఇప్పుడు సుశాంత్ కేసు విచారణలో ఒక కొత్త మలుపు చోటు చేసుకుంది.

కంగనా అలా ఆదిత్యచోప్రా మహేశ్ భట్ లను ‘సూసైడ్ గ్యాంగ్’ అనిందో లేదో… పోలీసులు వెంటనే ఆదిత్య చోప్రా ని విచారించారు. దాని తర్వాత మహేష్ భట్, కరణ్ జోహార్ లను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఇక మహేష్ భట్ ను సోమవారం ఉదయం విచారించారు. 11.30 గంటల నుంచి ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో రెండున్నర గంటల పాటు విచారించారు. అయితే మహేష్ మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా కు అఫైర్ ఉందని వార్తలు ఎప్పటినుండో వస్తున్నాయి. అంతేకాకుండా ఇది వరకే మహేష్ సుశాంత్ కు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో మహేష్ భట్ పై అందరికీ అనుమానం నెలకొంది. అంతేకాకుండా మహేష్ భట్ ప్రియురాలు పర్వీన్ బాబీ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం.... ఆమె చావు కూడా మిస్టరీ కావడం ఇప్పుడు అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. అసలు రెండున్నర గంటల పాటు అతని పై ప్రశ్నల వర్షం కురిపించారు అంటే అసలు పోలీసులకు ఎలాంటి సమాచారం దొరికి ఉండొచ్చు అని ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అలాగే ఎంతో మంది మొదటి నుంది మహేష్ భట్ పై తీవ్ర మైన ఆరోపణలు చేస్తుండగా.. మహేష్ కు వ్యతిరేకంగా ఇప్పుడు కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి అని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: