బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య.... ఆ హీరోయిన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు ?

Gullapally Venkatesh

బాలీవుడ్ లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రాజపుత్ మరణం సంచలనంగా మారింది. గత నెలలో అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాతి నుంచి కూడా పరిణామాలు వేగంగా మారాయి. బాలీవుడ్ ప్రముఖులు కొందరు దీని వెనుక ఉన్నారు అనే ఆరోపణలు వచ్చాయి. కీలక నటుల పేర్లు వినిపించాయి. ప్రధానంగా కరణ్ జోహార్, బన్సాలి, హీరోలు సల్మాన్ ఖాన్, ఆదిత్య చోప్రా వంటి పేర్లు హల్చల్ చేసాయి. వారి ఒత్తిడి నుంచి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని  పలువురు వ్యాఖ్యలు చేసారు. 

 

వాటి వెనుక వాస్తవాలు ఎంత ఉన్నా సరే... ఈ సీన్ లోకి ఎంటర్ అయిన ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆందోళన కలిగించాయి. కరణ్ జోహార్ టార్గెట్ గా ఆమె విమర్శలు చేసారు. ఈ నేపధ్యంలో సుశాంత్ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసులు గురువారం కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసారు. ఆమె పేరిట జారీ చేసిన తాజా సమన్లు పోస్ట్ ద్వారా ఆమె మనాలి చిరునామాకు పంపించారు ముంబై పోలీసులు. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కాగా.. అక్కడే ఆమె ఇప్పుడు ఉంటుంది. మనాలి ఆమె సొంత నగరం. 

 

విచారణకు సంబంధించి.... బాంద్రా పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసు బృందం ఈ నెల 3 న సమన్ల కాపీతో ఖార్ జింఖానా సమీపంలోని రనౌత్ నివాసానికి వెళ్లినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమెను విచారణకు రావాలని కోరినా సరే ఆమె మాత్రం అక్కడ లేకపోవడంతో కంగనా వివరాలను తీసుకుని... సమన్లు పంపించారు. ఆమె మేనేజర్ కి ఫోన్ చేసి ఆమెను  విచారణకు రావాలని కోరినా సరే ఆమె మాత్రం ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వార్తను కంగనా టీం ఖండించింది. "కంగనాకు ఎటువంటి అధికారిక సమన్లు పంపబడలేదని పేర్కొంది. కంగనా వాంగ్మూలం తీసుకోవాలని భావించారు  గాని ఆమెకు ఎలాంటి నోటీసులు అందలేదని" స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: