సుశాంత్ మరణం పై బాలీవుడ్ క్వీన్ పోరాటం...!

Suma Kallamadi

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ మరణం పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భగ్గుమంటోంది. తాను చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే ఆమె మొదటి నుంచి కూడా నేపోటిజం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. కంగనా తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ పెద్దలందరికీ కూడా ఒక్క లెక్కలో ఇచ్చింది.

 

 

అయితే ఈ క్రమంలో కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వంటి వారిపై కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడింది. స్వర భాస్కర్, తాప్సి వంటి వారిని బి గ్రేడ్ అని సంబోధించడం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే తాప్సీని బి గ్రేడ్ యాక్టర్ అని పిలవడంతో కంగనా కి ఆటో పంచ్ పడింది. దీనితో కొంత మంది కంగనా రనౌత్ వైపు మాట్లాడగా మరికొందరు తాప్సీని బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇలా వీళ్ళ మధ్య వార్ జరుగుతోంది. ఇప్పుడు కంగనా, నగ్మా పై విరుచుకు పడుతోంది. నేపోటిజం అంటున్న కంగనా కి భారీగా కౌంటర్ ఇచ్చింది నగ్మా.

నగ్మా తాజాగా ఒక పోస్ట్ పెట్టి అసలు నెపోలియన్ పునాదుల మీద కంగనా వచ్చిందని ఒక మీమ్ నగ్మా పోస్ట్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య పంచోలి ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అని చెప్పుకొచ్చింది నగ్మా.

అలానే తన సోదరిని కంగనా మేనేజర్ గా నిర్మించడం నేపోటిజం కాదా..? అని ప్రశ్నించింది నగ్మా. సుశాంత్ మరణించక ముందు ఏమీ మాట్లాడలేదు కానీ సుశాంత్ లేనప్పుడు తన బెనిఫిట్ కోసం నచ్చినవన్నీ మాట్లాడుతోందని నగ్మా ట్వీట్ చేసింది.

 

 

అయితే నగ్మా మాటలకి నెటిజన్లు మండి పడ్డారు. ఆమె పై కూడా పలు కామెంట్లు పెట్టి ఓ రేంజ్లో చెడామడా తిట్టారు. ఇలా వీరిద్దరి మధ్య పోరాటం సాగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: