అతడిని కోల్పోవడం హిందీ చిత్రసీమకి తీరని నష్టం..మల్లికా షరావత్!!

Surya

 

బాలీవుడ్ మరియు హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఇవాళ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్ లో కడుపులో పెద్ద ప్రేగు నొప్పికారణంగా చికిత్స తీసుకుంటున్నాడు. ఈ తెల్లవారు జామున ఇర్ఫాన్ కన్ను ముసారనే వార్తా బయటకు వచ్చింది. అయితే ఈవిషయాన్ని తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇర్ఫాన్ ఖాన్,  మల్లికా షరావత్ కలసి నటించిన చిత్రం హిస్స్ ,హిస్స్ సినిమాలో నాగిని పాత్ర దారిని మల్లికా షరావత్ కు సహాయకుడి పాత్రలో ఇర్ఫాన్ నటించి మెప్పించాడు . అయితే స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమా తో ఫేమస్ అయినా ఇర్ఫాన్ వరుసగా లైఫ్ అఫ్ పై , జురాసిక్ వరల్డ్, ఈ మైటి హార్ట్ వంటి హాలీవుడ్ చిత్రాలలో కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇర్ఫాన్ కు 2018 లో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది.అందుకుగాను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు.కానీ ఈ మధ్యనే ఆ వ్యాధి తిరిగి వచ్చింది.

 

 

 

మల్లి ఆవ్యాది ట్రీట్మెంట్ తీసుకోవడంతో తగ్గుముఖం పట్టింది....అయితే కొద్దిరోజులుగా కడుపులోని పెద్ద ప్రేగులు దెబ్బతినడంతో అతనిని ముంబై లోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ హాస్పిటల్ లో తరలించగా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు .అయితే రెండు రోజులక్రితం తన తల్లి అకాల మరణం చేయడంతో లాక్ డౌన్ కారణంగా వెళ్లలేక పోయాడు అయితే వీడియో కాల్ ద్వారా ఆమె అంత్య క్రియలు చూసి బాధపడ్డాడు. ఈరోజు ఉదయం తెల్లవారు జామున కాలం చేశారు.ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల నివాళులు అర్పించారు. అయితే తనతో హిస్స్ చిత్రం లో నటించిన మల్లికా షరావత్ అయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ సందర్భంగా మల్లికా తన ట్విట్టర్లో అయన ఏంటో మచిత్రం ద్వారా తెలుసుకున్నాము..ఆయన కాలం చెల్లించడం బాలీవుడ్ చిత్ర సీమకు తీరని లోటు ..అయన ఆత్మకు శాంతి కలుగుగాక ..అదేవిధంగా అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ' అని ట్వీట్ చేసింది ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: