నాగ శౌర్య కు ఊహలు గుసగుసలాడే తో మొదటి హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల.. కొంత కాలం గ్యాప్ తరువాత మళ్ళీ ఈ కాంబో లో గత ఏడాది మరో సినిమా మొదలైంది. 50శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయితే ఈచిత్రాన్ని పక్కకు పెట్టి నాగశౌర్య, అశ్వథ్థామ ను లైన్ లోకి తెచ్చాడు. దాంతో శ్రీనివాస్ అవసరాలతో చేసే సినిమా ఆగిపోయందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈసినిమా విషయంలో నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిబొట్ల క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆగిపోలేదని నెక్స్ట్ షెడ్యూల్ యూఎస్ లో జరుగనుంది, వీసా పర్మిషన్ల విషయంలో ఆలస్యం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు సినిమా కూడా బాగా వస్తుందని వెల్లడించాడు.
ఇక ఇదిలా ఉంటే ఇటీవల 'అశ్వథ్థామ' తో వచ్చిన నాగ శౌర్య కు ఈసారి కూడా నిరాశనే మిగిలింది. ఈ సినిమా కోసం అతను చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఫుల్ రన్ లో 5కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి చేతులేత్తేసింది. ఇక ప్రస్తుతం నాగశౌర్య, లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో నటిస్తున్నాడు. పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం మే లో విడుదలకానుంది.
ఈ సినిమాతోపాటు శౌర్య, సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో ఈ సినిమా చేయాల్సి ఉంది గత ఏడాదే ఈ సినిమా లాంచ్ కూడా అయ్యింది. సునీల్ నారంగ్ , శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇవే గాక మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో కొద్దీ రోజుల క్రిందట సినిమా చేసేందుకు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నూతన దర్శకుడు రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.