ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ కొత్త వ్యాపార ఆలోచన !

Seetha Sailaja

ఇప్పటికే విజయ్ దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో గార్మెంట్స్ వ్యాపారంలో ఉన్నాడు. ఇది కాకుండా ఈ ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల షో రూమ్స్ ఓపెన్ చేసే అనే ఆలోచనతో ఒక ప్రముఖ వస్త్ర వ్యాపారితో విజయ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే విజయ్ మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మల్టీ ప్లెక్స్ ధియేటర్లు ఒక్క హైదరాబాద్ లో తప్ప తెలంగాణ ప్రాంతంలోని మిడిల్ రేంజ్ సిటీలలో ఎక్కడా లేవు. దీనితో ఈలోటును గుర్తించిన విజయ్ తన సొంత ఊరైన మహబూబ్ నగర్ లో మూడు స్క్రీన్స్ తో ఉండే ఒక మల్టీ ప్లెక్స్ నిర్మాణాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి నిర్మాణం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే నిర్మాణం పనులు మొదలుపెట్టిన ఈ మల్టీ ప్లెక్స్ ధియేటర్లు ఈ సంవత్సరంలోనే ప్రారంభం అవుతాయి అని వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా విజయ్ ఒక భారీ మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ నిర్మాణానికి అదేవిధంగా ఒక మాల్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం ఇప్పుడు విజయ్ వెతుకుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్ ఈ మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ బిజినెస్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ కూడ హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఒక అత్యంత భారీ స్క్రీన్ తో కూడిన ఒక మల్టీ ప్లెక్స్ నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ అనేక వ్యాపార సంస్థలలో భాగస్వామిగా ఉన్నాడు. అయితే విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం 10 సంవత్సరాలు కూడ పూర్తి కాకుండానే ఇన్ని వ్యాపారాలు మొదలు పెట్టడంతో విజయ్ కి ఇంత భారీ సంపాదన ఉందా లేక విజయ్ వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తులు ఎవరు అంటూ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: