జగన్ నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మార్పులు !

Seetha Sailaja

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులు ఎవరు పెద్దగా హాజరుకాలేదు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 6నెలలు తరువాత జగన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ఉప్పెనలా ప్రశంసలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల దగ్గర నుండి చిన్న స్థాయి  వారి వరకు జగన్ ను అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదన పట్ల అన్ని వర్గాలు కంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రశంసలు  చాల ఎక్కువగా వస్తున్నాయి. విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా  మారబోతున్నట్లుగా జగన్ చేసిన ప్రకటనను టాలీవుడ్ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి కూడ జగన్ నిర్ణయానికి ఓపెన్ గా మద్దతు ఇవ్వడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులకు చాలా పెద్ద స్థాయిలో భూములు ఉన్నాయి. విశాఖ బీచ్ రోడ్ ని అనుకున్న ప్రాంతంలో సినీ ప్రముఖులకు పెద్ద స్థాయిలో భూములు ఉన్నాయి. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ భూములు అన్నింటికి ఇప్పుడు విపరీతమైన విలువ పెరిగే ఆస్కారం ఉంది. దీనికితోడు ఎప్పటి నుంచో చిరంజీవి విశాఖలో ఒక భారీ స్టూడియో కట్టే ఆలోచనలు చేస్తున్నాడు. 

20 ఏళ్ళ క్రితమే విశాఖలో రామానాయుడు స్టూడియో కట్టినా అది ప్రస్తుతం అక్కడ షూటింగ్స్  జరగకపోవడంతో నిరుపయోగంగా పడి ఉంది. దీనితో రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం తమకు కోట్లు కురిపిస్తుంది అన్న ఆలోచనలతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు పండుగ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో హైదరాబాద్ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ విశాఖకు మారడం ఖాయం అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలు అయిపోయాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: