బాబా భాస్కర్ నీ తోసేసిన వితిక నీ విమర్శలు చేస్తున్న నెటిజన్లు..!

KSK
బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం చాలా భిన్నంగా మారుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ త్రీ చివరి దశకు చేరుకుబోతున్న క్రమంలో..బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు...బిగ్ బాస్ షో చూస్తున్న వీక్షకులకు ఇంటి లోపల ఉంటున్న కంటెస్టెంట్ లకు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లో భాగంగా ఇప్పటికే కులాయి కొట్లాట, ప్రిజ్మా బ్యాలెన్స్ ఫ్రేమ్, రిక్షాలో వీర విహారం అనే టాస్క్ లు పెట్టడం జరిగింది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో రిక్షాలో వీరవిహారం టాస్క్ లో బాబా భాస్కర్, వితిక ఇద్దరూ పాల్గొనడం జరిగింది. అయితే ఈ టాస్క్ ఏమిటంటే రిక్షాలో కూర్చున్న వీరిద్దరు ఎవరు ముందు..కాలు కింద పెడితే వాళ్లు..ఔట్ అయినట్లు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.


ఈ టాస్క్ లో భాగంగా రిక్షా లో కూర్చున్న భాస్కర్ ని మరియు వితిక లకు….కారం కారంగా ఉండే పచ్చిమిరపకాయలు తినిపించడం జరిగింది అలాగే మూడు స్వెటర్లు చేయించడం జరిగింది మరియు అదే విధంగా ఫుల్ కూలింగ్ ఉన్న యాపీ ఫిజ్ డ్రింక్ ను తాగించడం జరిగింది. అయితే తాగిన వీరిద్దరూ చివరాకరికి రిక్షాలో కూర్చున్న సందర్భంలో...బాబాకు అర్జెంట్ అంటూ.. వితికాను కొంచెం ముందుకు జరగమన్నాడు. అయితే రిక్షాలోనే తాను కానిచ్చేస్తాను అని తెలిపాడు. దీనికి వితికా నిరాకరించింది. ఆ సమయంలో బాబా నిల్చొని ఉండటంతో.. బయటకు తోసేసింది.


దీంతో బాబా మొదటగా రిక్షాను దిగేశాడు. దీంతో వితిక చేసిన పని పై...ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. అసలు తోయడం అనేది రూల్ లో లేదని చాలామంది ఇంటి సభ్యులు చర్చించడం జరిగింది. చివరాకరికి నిర్ణయాన్ని బిగ్ బాస్ కి వదిలేయడంతో..బిగ్ బాస్ వితిక గెలిచినట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఇదంతా చూసిన చాలామంది వీక్షకులు సోషల్ మీడియాలో నెటిజన్లు వితిక చేసిన పని పై మండిపడుతున్నారు. నిజంగా రిక్షా నుండి తోయ్యాలి...అనే రూల్ ఉంటే..బాబా భాస్కర్ ఎప్పుడో గెలిచే వారిని...ఇదంతా బిగ్ బాస్ కావాలనే వితిక నీ గెలిపించడానికి చేశారనే విమర్శలు చేస్తున్నారు. గత కొన్ని వారాల నుండి బాబా భాస్కర్ ని బిగ్ బాస్ షో నిర్వాహకులు టార్గెట్ చేస్తున్నారని...చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: