మహేష్ బాబు అడ్డాలో అల్లు అర్జున్......!!

Mari Sithara
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సూపర్ స్టార్, ఈ సినిమాలో అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి, మరొక నటి సంగీత మరియు కమెడియన్ బండ్ల గణేష్ తదితరులు తెలుగు తెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. మహేష్, అనిల్ సుంకర, 

దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇటీవల హైదరాబాద్ లోని గచ్చి బౌలి ప్రాంతంలో అత్యంత భారీ ఖర్చుతో ఏషియన్ సినిమాస్ వారి సౌజన్యంతో మహేష్ బాబు, ఏఎంబి సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టిప్లెక్స్ ని నిర్మించిన విషయం తెలిసిందే. ఎన్నో అధునాతన సౌకర్యాలతో రూపొందిన ఈ మల్టిప్లెక్స్ కు నేడు మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేసి సందడి చేసారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, తన భార్య స్నేహ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించేందుకు ఏఎంబికి విచ్చేసిన స్టైలిష్ స్టార్ కు అక్కడి యాజమాన్యం ఎంతో ఘనంగా ఆహ్వానం పలికింది. 

ఇక సినిమా వీక్షించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఏఎంబి సినిమాస్ లో సినిమా చూసిన ఎక్స్పీరియెన్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ఇక సైరా సినిమాలో మెగాస్టార్ పెర్ఫార్మన్స్ అదరహో అనే రేంజ్ లో ఉందని, అలానే ఇతర పాత్రధారులు కూడా తమ పాత్రలో ఒదిగిపోయి ఎంతో అద్భుతంగా నటించినట్లు చెప్పారట అల్లు అర్జున్. ఇక చివరిగా, సైరా మంచి సక్సెస్ సాధించినందుకు తన తరపున ఆ సినిమా యూనిట్ మొత్తానికి ఆయన శుభాభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: