లెక్కలు మార్చేస్తున్న రంగస్థలం !

Seetha Sailaja

రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబినేషన్ రూపొందుతున్న ‘రంగస్థలం’ పై రోజురోజుకి భారీ అంచనాలు పెరిగిపోతున్న నేపధ్యం మధ్య విడుదలైన ‘రంగస్థలం' టీజర్ సృట్టిస్తున్న సంచనలాలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఇప్పటికే ఈటీజర్ ను రాజమౌళి నుండి అల్లుఅర్జున్ వరకు పరుచూరి నుండి వంశీ పైడిపల్లి వరకు ఇలా అనేకమంది మెచ్చుకున్న పరిస్థితులలో ఈ టీజర్ ఎవరు ఊహించని ఒక కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది.


వాస్తవానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అత్యంత ఆదరణ పొందిన ట్రలైర్ టీజర్ అంటే అందరు ఖచ్చితంగా ‘బాహుబలి’ గురించి  మాత్రమే చెపుతారు ‘బాహుబలి’ టీజర్ అప్ లోడ్ చేసిన 1రోజులోనే.. అంటే 24 గంటల్లో ఏకంగా 1 కోటి వ్యూస్ వచ్చాయి.  ఆ తరువాత అంతటి ఫీట్ చేసిన టీజర్ అంటే మొన్న వచ్చిన అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ గురించి మాత్రమే చెపుతున్నారు. ఈ టీజర్ కు 29 గంటల్లో 1 కోటి వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పడు ‘రంగస్థలం’ మాత్రం ఆ రెండోస్థానం తాలూకు లెక్కను మార్చేసింది అన్న వార్తలు వస్తున్నాయి.

 

మైత్రి మూవీస్ వారి అఫీషియల్ ఛానల్ లో ఇప్పటివరకు 7998251 వ్యూస్ తెచ్చుకున్న ‘రంగస్థలం’ టీజర్ 25.5 గంటల్లో అన్ని ఛానల్స్ లో కలుపుకుని 1 కోటి వ్యూస్ తెచ్చుకుంది అని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈలెక్కలు బట్టి ‘బాహుబలి’ తరువాత ఇప్పుడు ఎక్కుమంది చూసిన టీజర్ గా ‘రంగస్థలం’ కొత్త రికార్డును క్రియేట్ చేసింది అని అంటున్నారు. దీనితో ప్రస్తుతం టీజర్ కు ఇలాంటి స్పందన వస్తు ఉంటే  ఈమూవీ విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ చరణ్ అభిమానులు ఇప్పడు కొత్త లెక్కలు తయారు చేస్తున్నారు.

 

అయితే ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి టీజర్ చేస్తున్న హడావడితో అంచనాలు పెరిగిపోయి ఆసినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలు చేరుకోలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో ‘రంగస్థలం’ ఎటువంటి రిజల్ట్ తీసుకువస్తుంది అన్న భయంలో  ఈ సినిమా బయ్యర్లు ఉన్నట్లు టాక్..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: