యాంకర్ పై మైక్ విసిరేసి సీరియస్ గా వెళ్లిపోయిన జబర్దస్త్ ఆనంద్..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై  ఇప్పటి వరకు ఎన్నో కామెడీ కార్యక్రమాలు, సీరియల్స్ వచ్చాయి.  కానీ గత మూడు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించి ప్రపంచంలో తెలుగు వారందరికీ చేరువైన కార్యక్రమం ‘జబర్ధస్త్’ కామెడీ షో.  ఈ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు సొసైటీలో సెలబ్రెటీలు అయ్యారు.  కొంత మంది టాలీవుడ్ లో మంచి కమెడియన్లు గా కొనసాగుతున్నారు.  అంతే కాదు జబర్ధస్త్ తో హాట్ హాట్ గా తమ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న యాంకర్లు అనసూయ, రష్మి ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  

 ఈ కార్యక్రామానికి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజలు కూడా బాగా పాపులర్ అయ్యారు.  మొత్తానికి జబర్ధస్త్ కామెడీలో నటిస్తున్న వారు ఆర్థికంగా మంచి పొజీషన్లోకి వచ్చారు.  తాజాగా జబర్ధస్త్ కామెడీలో షో కమెడియన్ గా నటిస్తున్న ఆనంద్ తో ఓ లేడీ యాంకర్ ఇంటర్వ్యూ తీసుకుంది.  అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలు..గతంలో మీరు చమ్మక్ చంద్ర, రచ్చ రవితో చేశారు..కదా మరి వారితో ఎందుకు విభేదించారు అన్న ప్రశ్నకు ఆనంద్ కో ఆర్డినేషన్ సింక్ కాకపోతే పక్కకు తప్పుకుంటాం అని వివరణ ఇచ్చారు.  

ఈ మద్య జబర్ధస్త్ కామెడీ షోలో వర్గారిటీ ఎక్కువైందని అడిగిన ప్రశ్నకు అలా అని ఎందుకు అనుకుంటున్నారూ..మా కుటుంబం అంతా కలిసి చూస్తాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పారు.  ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై వివరణ ఇస్తూ..గతంలో కొన్ని సినిమాలు కూడా ఇలాంటి డబుల్ మీనింగ్ తో కూడుకున్నవి వచ్చాయని..ఇలాంటి స్కిట్స్ గనక ఉంటే బాబు, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కూర్చొని ఎడిట్ చేస్తున్నట్లు తెలిపారు. జబర్ధస్త్ లో ఈ మద్య మీరు కూడా ఆడ వేశం వేస్తున్నారు కదా మరి మీరు ఏమైనా తేడానా..? అని ప్రశ్నించింది.

 దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆనంద్ ‘జబర్ధస్త్’ లో ఆడ వేషం వేసినంత మాత్రాన అందరూ గే లు కాదు..ఆ స్కిట్ కి అలా అవసరం కనుక వేస్తాం..బయటికి వస్తే అందరూ కామన్. అయినా ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మమ్ముల్ని ఎందుకు అవమాన పరుస్తారూ అంటూ ఆవేశంతో యాంకర్ పై మైక్ విసిరేసి సీరియస్ గా వెళ్లిపోయిన జబర్దస్త్ ఆనంద్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: