Money: ఈ సాగుతో రూ.5 లక్షలకు పైగా ఆదాయం..!
ప్రస్తుతం ఎండాకాలం కావడంతో కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టమోటాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు గోధుమలు ,మినుములు పండించే రైతులు ఇప్పుడు కూరగాయలను పండిస్తూ మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక గోధుమలు, ఆవాలు వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా టమాటా, పొట్లకాయ వంటి పంటలు సాగు చేస్తే ఆదాయాన్ని మంచిగా రెట్టింపు చేసుకోవచ్చు . ఈ పంటలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. వేసవికాలంలో కొద్దిపాటి నీటితో ఈ పంటను మీరు పండించవచ్చు.
టమాటా మొక్కలను నాటడానికి ముందు నేలను నాలుగు రోజులపాటు నీటిని పారించి నేలను నానబెట్టుకోవాలి. ఇక మొక్కలను నాటడానికి ముందు నువాక్రాన్ 15 ఎంఎల్ , డితెన్ ఏం -45 25 గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి 5, 6 నిమిషాల పాటు మొక్కలను ద్రావణంలో ఉంచి ఆ తర్వాత మొక్కలను నాటుకోవాలి . ఇకపోతే ఈ పద్ధతి సాయంత్రం వేళ అవలంబిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుంది.. అంతేకాదు పంట దిగుబడి బాగా వస్తుంది. అలాగే మధ్య మధ్యలో కలుపు మొక్కలు కూడా తీస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ టమోటా పంట సంవత్సరానికి రూ. 5 లక్షలకు పైగా ఆదాయాన్ని అందిస్తోంది. వర్షాకాలం కంటే వేసవికాలంలోనే అధిక దిగుబడి పొందుతున్నారు రైతులు.