మనీ: ప్రతిరోజు 70 రూపాయల ఆదాతో రూ.48 లక్షలు మీ సొంతం..!

Divya
తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్తగా ఎన్నో పథకాలను తమ కష్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా మీరు కూడా భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరు ఊహించలేరు. కాబట్టి అలాంటి వారి కోసమే చక్కటి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్ఐసి. వాస్తవానికి పెట్టుబడి పెట్టడానికి మార్కెట్లో చాలా ఎంపికలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు . కాబట్టి ఎల్ఐసి అందిస్తున్న అద్భుతమైన స్కీం గురించి ఇప్పుడు చూద్దాం.
ఎల్ఐసి ప్రభుత్వం తరఫున ఒక కొత్త ఎండోమెంట్ పాలసీని ప్రారంభించింది. ఇందులో తక్కువ పెట్టుబడితో పెద్ద రాబడి పొందవచ్చు.  రోజు 70 రూపాయల పెట్టుబడి పెట్టడం వల్ల మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి రూ. 48 లక్షలు లభిస్తాయి. దీంతోపాటు భీమా రక్షణ,  ఇతర పన్ను సంబంధిత ప్రయోజనాలు కూడా పొందవచ్చు.  అంతేకాదు ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు.. ఆడపిల్లల పెళ్లిళ్ళకే కాదు మరెన్నో అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుంది.
ఎల్ఐసి అందిస్తున్న ఈ కొత్త పాలసీ ప్రకారం 8 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నవారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ వ్యవధి 12 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది.  ఇందులో మీరు కనీసం లక్ష రూపాయలు గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే ప్రతిరోజు రూ.70 అంటే సంవత్సరానికి 26,534 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది . రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం రూ.25,962 కి తగ్గుతుంది.  ఈ విధంగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.48 లక్షలు చివరిగా మీ చేతికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: