మనీ: జియో ఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా..!

Divya
దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న టెలికాం సర్వీసులలో రిలయన్స్ జియో మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే రిలయన్స్ జియో ఏది చేసినా సరే సంచలనంగానే ఉంటుంది. ఇక ఆ సంస్థ అందించే ఆఫర్లను తట్టుకోవడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగ రాబోతున్న సమయంలో మూడు జియో ఫైబర్ ప్లాన్లను విడుదల చేసింది. ఇక ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులు కొత్త కనెక్షన్ కొనుగోలు చేసి. రూ.599 , రూ.899 ప్లాన్లలో ఒకదానికి ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. ఇక ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 మధ్య మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆఫర్ ప్రయోజనాలను పొందడానికి కొత్త కనెక్షన్ తీసుకొని ఈ రెండు ప్లాన్లలో ఒకదానికి సభ్యత్వాన్ని పొందాలి.

రూ.599 , రూ.899 ప్లాన్లలో ఆరు నెలల పాటు సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లు 100% వాల్యూ బ్యాక్ మరియు 15 రోజుల అదనపు వాలిడిటీ పొందుతారు. ఆశీర్వదించారు. రూ.899 ప్లాన్ కు మూడు నెలల పాటు 100% వాల్యూ బ్యాక్ ఆఫర్ అర్హత కూడా ఉంటుంది. ఇకపోతే 15 రోజుల అదనపు వాలిడిటీ అయితే ఈ ప్లాన్ కు వర్తించదు ఇస్తా. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 28 మధ్య జియో ఫైబర్ ప్లాన్లు మరియు కొత్త కనెక్షన్ల విషయానికి వస్తే వినియోగదారులకు రూ.6,500 విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

రూ.599 ప్లాన్ తో జియో కొత్త కస్టమర్లు జియో ఫైబర్ తీసుకుంటే ఆరు నెలల పాటు ఓచర్ల రూపంలో రూ.4500 విలువైన ప్రయోజనాలను పొందుతారు. అందులో 1000 రూపాయల విలువైన Ajio ఓచర్ , రూ.1000 విలువైన రిలయన్స్ డిజిటల్ ఓచర్ , రూ.1000 విలువైన నెట్ మెడ్స్ ఓచర్ , రూ.1000
ఇక్సిగో ఓచర్ ని కూడా పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: