మనీ: సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త..!
ప్రస్తుతం పీ పీ ఎఫ్ పై సంవత్సరానికి 7.1% వడ్డీ అందుబాటులో ఉంది. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% సంవత్సర రాబడి కూడా ఇవ్వబడుతుంది. ఇక అంతేకాదు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై 5.8% రాబడిని కలిగి ఉంటుంది. ఇక కిసాన్ వికాస పత్ర పై వడ్డీ రేటు 6.9% గా ఉన్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఇలాంటి ప్రభుత్వ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు దీర్ఘకాలంగా పెట్టుబడి పెడితే మీకు మంచి ఆదాయంతో పాటు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
నేషనల్ పెన్షన్ సిస్టం ఆర్థిక భరోసాను ఇస్తే.. సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. కాబట్టి ఈ పథకాలపై ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడిని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి.