అయ్యో.. కొడుకు ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి?

ఫేమస్ అయిపోవాలనే ఆత్రంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న చిత్ర విచిత్ర వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు వచ్చేలా కొందరి పనులుంటే.. ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా మరికొందరి చేష్టలు ఉన్నాయి.  తాజాగా తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి.. ఆ పసిబిడ్డ మరణానికి కారణం అయ్యాడు ఓ ఇన్ ప్లూయెన్సర్ .

అవును.. ఇటీవల కాలంలో ఫేమస్ అయిపోవాలని భావిస్తూ.. సోషల్ మీడియా వేదకిగా కొంతమంది ఇన్ ప్యూయెన్సర్లు చేస్తున్న చేష్టలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా .. రష్యాకు చెందిన  ఓ ఇన్ ప్లూయోన్స్ తన సొంత కుమారుడిపై ప్రయోగాలు చేసి.. అతని మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరం రుజువు కావడంతో అతడిపై శిక్ష పడింది. దీంతో ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.

రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ గా ఉన్నాడు. ఈ సమయంలో అతడు పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ ల గురించి చెబుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. ఇందులో భాగంగా మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని.. సూర్యరశ్మితోనే ఎంతకాలం అయినా జీవించ వచ్చని భ్రమపడ్డాడు. ఈ మేరకు సొంత కొడుకుపై ప్రయోగాలు మొదలు పెట్టాడు.

దీని నిరూపించేందుకు నెలలు నిండని తన కొడుకుపై ప్రయోగం ప్రారంభించాడు. ఈ సమయంలో అతని భార్య ఎంత వారించినా ఆయన వినలేదు. ఆ శిశువుకి పాలు పట్టొద్దని గట్టిగా హెచ్చరించేవాడు. ఆ శిశువుని ఎండలోనే ఉంచాలని .. అప్పుడు కోలుకుంటాడని మూర్ఖంగా వాదించేవాడు. ఈ సయంలో బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు కాదు. ఎట్టకేలకు పలువురి ఒత్తిడి మేరకు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. కోర్టు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: