శరీరంలోని రోగాలన్నిటికీ గోల్డెన్ మిల్క్ తో చెక్ పెట్టేయండి..!
ఈ గోల్డెన్ మిల్క్ కోసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీరు కలపని ఒక గ్లాస్ పాలను పోయాలి.అందులోనే చిటికెడు పసుపు,అర స్ఫూన్ దాల్చిన చెక్క పొడి అరంగుళం అల్లం వేసి బాగా మరగనివ్వాలి.ఇలా మరిగిన పాలకు ఒక స్ఫూన్ తేనె కలిపి తీసుకోవాలి.ఈ గోల్డెన్ మిల్క్ ని రాత్రి పడుకోబోయే ముందు తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ పాలను తరుచూ తీసుకోవడంతో,ఇందులోని విటమిన్లు,మినరల్స్,మాంగనీస్,ఇనుము,పీచు, విటమిన్ బి6,కాపర్,పోటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.పసుపు యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది.దీనితో రోగ నిరోధక శక్తి పెరిగి,సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,జ్వరం వంటివి దరి చేరవు.ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
నిద్రలేమితో బాధపడేవారు రోజు ఈ పాలను పడుకోబోయే ముందు తీసుకోవడం వల్ల మెలటోనీన్ ఉత్పత్తి జరిగేలా చేసి,తొందరగా నిద్రకు ఉపక్రమించేలా సహాయపడుతుంది.మరియు దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి.ఇవి పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.దీనితో బ్లడ్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవడంలో సహాయపడతాయి.మరియు అల్లం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది.అధిక బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది.
కావున ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిన గోల్డెన్ మిల్క్ తీసుకోవడం మీరు కూడా అలవాటు చేసుకోవడం ఉత్తమం.