ఇలా చేస్తే ఏ జబ్బు రాకుండా హెల్తీగా ఉంటారు?

Purushottham Vinay
చలికాలంలో అందరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ కాలంలో దాహం వేయకున్నా నీళ్లు పుష్కలంగా తాగాలి. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అదే విధంగా బయటకి వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్ కూడా ధరించాలి. ఈ కాలంలో వాతావరణ పరిస్థితులు మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి. ఒక అర చెంచా ఉసిరి పొడిని ఒక చెంచా తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఉసిరి రసం లేదా పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణాన్ని చూర్ణం చేసి గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే మంచిది. ఈ కాలంలో పుట్టగొడుగులు రెగ్యులర్ గా తినాలి.పాలకూరను క్రమం తప్పకుండా తినడం మర్చిపోకూడదు. పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెల్ల రక్త కణాలను చురుకుగా ఉంచుతుంది. ఇందులో సెలీనియం అనే మిలనర్స్‌ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, రిబోఫ్లావిన్, నిసిన్ కూడా ఉంటాయి.



పాలకూర శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫోలేట్ ఉంటుంది. ఇది శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. దానితో పాటు ఫైబర్, ఐరన్, విటమిన్ సి శరీరాన్ని అన్ని వైపుల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఈ చలికాలంలో పాలకూరను క్రమం తప్పకుండా తినడం మర్చిపోకూడదు.రోగనిరోధకతను పెంచడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులకు వెల్లులి చాలా మంచిది. నీటిలో వెల్లుల్లి పొడిని కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టకుండా మరగనివ్వాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 2 నిమిషాలు మూతపెట్టాలి. కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఈ నీటిని కొద్దికొద్దిగా తాగాలి. ఇలా ప్రతి రోజూ తాగడవ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఈ జలుబుతో వచ్చే ఇతర వ్యాధులతో ఇది పోరాడుతుంది.ఒక గ్లాసుడు పాలలో ఈ పొడిని ఒక స్పూన్‌ వేసి మరిగించాలి. పెద్ద మంట మీద ఒక నిమిషం మరగనివ్వాలి. ఆ తర్వాత స్టౌవ్‌ ఆఫ్‌ చేసి 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత నెమ్మదిగా తాగాలి. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: