వానా కాలం వచ్చేసింది. ఈ వర్షాల కారణంగా పరిసరాలన్నీ కూడా బాగా బురదమయం అవుతున్నాయి. అందువల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.ముఖ్యంగా నిల్వ ఉన్న నీటి వల్ల దోమల వ్యాప్తి పెరిగి, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకే వానా కాలంలో ఖచ్చితంగా డెంగ్యూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 136 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. క్రమంగా దేశ వ్యాప్తంగా కూడా ఈ కేసుల సంఖ్య చాలా భారీగా పెరుగుతోంది. ముందస్తు లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి,అందుకు అవసరమైన చికిత్సని తీసుకోవాలి.ఈ డెంగ్యూ ఏడిస్ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు వల్ల సంక్రమిస్తుంది. ఇక ఈ డెంగ్యూ జ్వరానికి రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి క్లాసికల్ డెంగ్యూ. దీనిని 'బ్రేక్ బోన్' ఫీవర్ అని కూడా అంటారు. ఇక మరోకటి డెంగ్యూ హెరేజిక్ ఫీవర్(DHF) అంటారు. ఇది చాలా ప్రమాదం.అయితే, డెంగ్యూ ముందస్తు లక్షణాలు 5 నుంచి 6 రోజుల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ముందుగా ఆకస్మిక జ్వరం, కళ్లలో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, పొత్తి కడుపు నిండుగా అలాగే చాలా అసౌకర్యంగా ఉంటుంది.
ఇక 5వ రోజున ఎర్రటి మచ్చలతో చర్మంపై దద్దుర్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.ఇక దోమలు కరవకుండా ఉండేందుకు చర్మంపై రిపెల్లెంట్ను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే, ఫుల్ స్లీవ్ డ్రెస్సులను వేసుకోవాలి. లేత గోధుమరంగు, లేద బూడిద రంగులో ఉండే దస్తులును ఇంకా శ్వాసక్రియకు అనుకూలమైన దుస్తులను ధరించాలి. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు స్టోర్ కాకుండా చూసుకోవాలి. నీటి కంటైనర్లను తొలగించడం, తలుపు ఇంకా కిటికీ తెరలను మూసివేయడం చేయాలి. అలాగే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయాలి. లేదంటే అలాంటి ప్రదేశాల్లో నివసించకుండా వేరే ప్రాంతాలకు వెళ్లాలి. అలాగే దోమకాటుకు గురవకుండా దుస్తులను నిండుగా ధరించాలి. ఇక హైడ్రేట్గా ఉండటానికి ఎక్కువగా నీటిని తాగాలి. ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ మీలో డెంగ్యూ లక్షణాలు ఎక్కువ కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని అందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.