సగ్గుబియ్యం ను ఇలా వాడితే ఆ జబ్బులు మాయం..!!
పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటు వంటి ఇత రేతర కృత్రిమ పదార్థాలు కలువకపోవడం ఇంకా కలిసొచ్చే విషయం. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు తరచుగా వాడితే ఖచ్చితంగా శరీరం లో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు న్యూట్రీషన్లు..
మాములుగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలిసిందే. అలానే కాదు, నీటి తో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. డైట్ లో ఈ సగ్గు బియ్యాన్ని చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సగ్గుబియ్యం సలాడ్ , కిచిడి వంటి వెరైటీ వంటలను ట్రై చేయండి. ఇప్పుడు బయట వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. అంతేకాదు రుచిగా కూడా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.డాక్టర్ తో పని లేకుండా ఆరోగ్యంగా ఉంటారు
చూసారుగా సగ్గబియ్యం తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇకమీదట వీటిని ఆహారం లో చేర్చుకోండి..