శరీరం వేడి చేయకుండా మామిడిపండ్లని ఇలా తినండి?

Purushottham Vinay
మామిడిపండ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్ లో ఎండలు ఎక్కువైయ్యే కొద్ది మనకు మామిడి పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఇక ఇవి ఎంత ఎక్కువగా పండితే తినడానికి అంత రుచిగా ఉంటాయి. ఈ మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చేస్తూ ఉంటారు.మామిడిపండ్లను ఇష్టపడని వారు అసలు ఎవరు వుండరు.వేసవికాలంలో మామిడి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.అయితే కొందరిలో మామిడిపండ్లను తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.సెగ గడ్డలు, కళ్లు ఎర్రగా మారడం, శరీరంలో వేడి చేసినట్టుగా ఉండడం, మలంలో రక్తం రావడం ఇంకా అలాగే మూత్రంలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తగానే చాలా మంది మామిడి కాయ తినడం వల్ల శరీరంలో వేడి చేసిందని అనుకుంటూ ఉంటారు. అందువల్ల మామిడి పండ్లను తినడమే పూర్తిగా మానేస్తారు. అయితే మామిడిపండ్లను తిన్నప్పటికి మనకు వేడి చేయకుండా ఉండాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మామిడి పండ్లల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వేడి చేయడానికి మరో కారణం మనం నీటిని తక్కువగా తీసుకోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే వేసవికాలంలో 4 నుండి 5 లీటర్ల దాకా నీటిని తాగాలని ఇలా నీటిని తాగుతూ మామిడిపండ్లను తినడం వల్ల అసలు వేడే చేయదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొద్దున్నే లేచిన వెంటనే లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి. ఇక అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత నుండి మళ్లీ నీటిని తాగాలి.ఇంకా అలాగే భోజనం చేసేటప్పుడు భోజనం చేసిన రెండం గంటల తరువాత నీటిని తీసుకోకూడదు. మళ్ళీ సాయంత్రం నీటిని తీసుకోవాలి.ఇలా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ల వల్ల సెగ గడ్డలు వస్తూ ఉంటాయి. ఈ మామిడి పండ్లను తినడం వల్లనే సెగ గడ్డలు వచ్చాయని భావిస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లు శరీరంలో రో గనిరోధక శక్తిని ఈజీగా పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: