తీపి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు?

Purushottham Vinay
తీపి పదార్దాలను ఇష్టపడని వారెవరు ఉండరు. గులాబ్‌ జామూన్, జిలేబి, రసగుల్లా, పాయసం ఇంకా వీటితో పాటు కూల్ డ్రింక్స్, రకరకాల పానియాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు ఎక్కువగా స్వీట్స్ ని ఇష్టపడేవారైతే, తీపి పదార్థాలను తినేవారైతే మీరు కచ్చితంగా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అతిగా తీపి పదార్థాలను తింటే మనం చాలా అనారోగ్యానికి దగ్గరగా ఉన్నామని అర్థం. తీపి పదార్థాలు తినడం మాత్రమే కాదు షుగర్ ని ఎక్కువగా కలిగి ఉండే కూల్ డ్రింక్స్, రకరకాల పండ్లు కూడా మనకు ప్రమాదమే.షుగర్‌ని ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.చక్కెర ఎక్కువగా కలిగి ఉన్న పదార్థాలను తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి.ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. ఇంకా అలాగే చక్కెర ఎక్కువగా తినడం వల్ల మెదడు కూడా మొద్దుబారిపోతుందట. అలాగే ఆలోచనా శక్తి తగ్గుతుందట.


దీంతో వయస్సు మీద పడేకొద్దీ మతిమరుపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా తగ్గించేయడం మంచిది.చక్కెరను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఇది డయాబెటిస్, గుండె సమస్యలకు ఖచ్చితంగా కారణమవుతుంది.ఇంకా అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి.అలాగే డిప్రెషన్ వస్తుంది. ఇది ఖచ్చితంగా మానసికంగా కుంగి పోయేలా చేస్తుంది. చక్కెరను ఎక్కువగా తినడం వల్ల పేగుల్లో కదలికలు సరిగ్గా ఉండవు. దీంతో మలబద్దకం కూడా వస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం కూడా వస్తుంది.ఇంకా చర్మంపై ముడతలు పెరిగిపోతాయి. చిన్న వయస్సులోనే వృద్ధుల్లా కనిపిస్తారు. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలకు చక్కెర సహాయం చేస్తుంది. కాబట్టి చక్కెరను అతిగా వాడరాదు. చక్కెరను ఎక్కువగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఇలా చక్కెరతో చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా తగ్గించేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: