సులభంగా సన్నగా అయ్యే సింపుల్ టిప్?

Purushottham Vinay
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అందరూ అధిక బరువు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు ఇంకా జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక బరువు సమస్య వల్ల కలిగే ఇబ్బంది అసలు అంతా ఇంతా కాదు. దీని వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె పోటు, మోకాళ్ల నొప్పులు, బీపీ, షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవడం వంటి చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు.ఎన్నో రకాల డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. అయినా కానీ ఎలాంటి ఫలితం లేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. డైటింగ్ పద్దతులను పాటించడం వల్ల అలాగే మందులను వాడడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం న్యాచురల్ గా ఈ సమస్య నుండి బయటపడాలి. ఒక చక్కటి ఆయుర్వేద టిప్ ని వాడడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ టిప్ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అలాగే దీనిని వాడడం కూడా చాలా ఈజీ.  


ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం 2 టీ స్పూన్ల పిప్పళ్లను, 2 టీ స్పూన్ల అవిసె గింజలను, 2 టీ స్పూన్ల సోంపు గింజలను ఇంకా అలాగే 2 టీ స్పూన్ వామును ఉపయోగించాల్సి ఉంటుంది.పిప్పిళ్లు మనకు ఆయుర్వేద షాపుల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ముందుగా ఒక కళాయిలో పిప్పిళ్లు, వాము ఇంకా అవిసె గింజలు వేసి దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోని ఇందులోనే సోంపు గింజలను వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా అర టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. డయాబెటిస్ తో బాధపడే వారు తేనెను ఉపయోగించకపోవడమే చాలా మంచిది. ఇక ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి.ఇక ఇలా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల అధిక బరువును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: