ముఖంపై గ్లాసీ లుక్ కోసం ఇ చిట్కా చేసి చుడండి..!
దీని కోసం కేవలం 3 పదార్థాలు సరిపోతాయి.ఇవన్నీ మనకు ఇంట్లోనే,తక్కువ ఖర్చులో దొరికేవే.అవి ఏంటంటే కలబంద గుజ్జు,టమోటాలు,విటమిన్ఈ క్యాప్సిల్స్ .
తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా గుజ్జు,2 స్పూన్ల కలబంద గుజ్జు మరియు విటమిన్ E ట్యాబ్లేట్ తీసి అందులోని ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని ముఖము,మేడ భాగంపై అప్లై చేసి ఆరనివ్వాలి.అది బాగా ఆరిన తర్వాత మైల్డ్ సోపుతో మర్దన చేస్తూ,గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి లేదంటే ఆ ప్యాక్ అప్లై చేసినా తరవాత చర్మం పై రంద్రాలు ఓపెన్ అయి ఉంటాయి.వాటిపై మళ్ళీ దుమ్ము, ధూళి చేరితే మొటిమలు,మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది.కావున మాయిశ్చరైజర్ తప్పక రాయాలి.
ఈ విధంగా వారానికి మూడు సార్లు అప్లై చేస్తూ ఉంటే రానురాను అధికంగా ఓపెన్ అయిన చర్మ రంద్రాలు ముసుకు పోయి,టాన్, మొటిమలు, మచ్చలు, ముడుతలను పోగొట్టి, ముఖం గ్లాసీ లుక్ నీ పొందుతుంది.ఇందులో వాడిన విటమిన్ E ట్యాబ్లేట్, ప్రతి మందుల షాప్ లలో తక్కువ ఖర్చుకే లభిస్తుంది. ఇది చర్మం మృదువుగా తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.కలబంద గుజ్జు ముడుతాలు రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. విటన్నింటితో పాటు చర్మం డీ హైడ్రెషన్ కాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.