కంటి చూపు మెరుగవ్వాలంటే ఈ పండ్లు తినండి?

Purushottham Vinay
చాలా మంది కూడా ఈరోజుల్లో కంటి చూపు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. కంటి చూపును బాగా మెరుగుపరచడంలో నిమ్మజాతికి చెందిన పండ్లు  ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎక్కువగా ఉండే విటమిన్ సి కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల కంటి చూపు  మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే దృష్టి లోపాలు ఇంకా అలాగే కంటిలో శుక్లాలు వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అదే విధంగా స్ట్రాబెర్రీస్, కార్న్ బెర్రీ ఇంకా బ్లాక్ బెర్రీ వంటి పండ్లు కూడా కంటి ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కళ్లు పొడిబారడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.అలాగే కంటి చూపు సమస్యలతో బాధపడే వారు అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం కంటి చూపును సంరక్షిచండంలో ముఖ్యంగా కళ్లు పొడిబారడాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే మామిడి కాయలను, బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం కంటి చూపు దెబ్బతినకుండా ఈజీగా కాపాడుకోవచ్చు.


వీటిలో ఉండే లుటీన్ ఇంకా జియాక్సంతిన్ అనే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఎందుకంటే ఇవి మంచి సహజ సిద్ద సన్ బ్లాక్స్ గా పని చేస్తాయి.ఇంకా అలాగే రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో ఇంకా అలాగే బ్లూటైట్ నుండి కంటిని సంరక్షించడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అదే విధంగా ఆప్రికాట్ లను తినడం వల్ల కూడా మనం కంటి చూపును చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు.ఎందుకంటే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇంకా కెరోటినాయిడ్స్, బీటా కెరోటీన్ వంటి పోషకాలు ఈ ఆప్రికాట్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేగాక ఇవి రాత్రి పూట చూపును మెరుగుపరచడంతో పాటు అతినీల లోహిత కిరణాల నుండి రెటీనాను కాపాడడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు మీ చూపు కూడా దెబ్బతిన్నకుండా ఉంటుంది. కంటి చూపు తగ్గడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చక్కటి కంటి చూపును సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: