స్త్రీల ఆరోగ్యానికి సంపూర్ణ ఆహారాలు ఇవే?

Purushottham Vinay
స్త్రీలు వారి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోషకాలు ఉన్న మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేడ్స్, ప్రోటిన్లు ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు వంటి పలు రకాల పోషకాలను స్త్రీలు తమ శరీరానికి ఎప్పడూ ఇస్తూ ఉండాలి. లేదంటే పోషకాహార లోపంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు  ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాక వారిలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా బాగా దెబ్బతింటుంది. ఇక అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి పోషకాలను శరీరానికి ఇస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..స్త్రీలు మెదడు, కండరాలు, ఇమ్యూనిటీలకు విటమిన్‌ డి అనేది చాలా అవసరం. ఈ విటమిన్‌ కోసం గుడ్లు, చేపలు, పాలు, నారింజ రసం, జున్ను ఇంకా అలాగే సోయా తీసుకుంటూ ఉండాలి.ఇంకా అలాగే ఎముకల పటుత్వానికి క్యాల్షియం కూడా చాలా అవసరం. గుండె, నాడులు ఇంకా కండరాల పనితీరుకు తోడ్పడే క్యాల్షియం కోసం పాల ఉత్పత్తులు, నువ్వులు ఎప్పుడూ కూడా తీసుకుంటూ ఉండాలి.అలాగే మెదడు సక్రమ పనితీరుకు ఖచ్చితంగా బి12 అవసరం. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా ఇంకా రక్తకణాల సంఖ్య పెరిగి మంచి శక్తి సమకూరాలన్నా బి12 దొరికే మాంసాహారం ఇంకా అలాగే పాల ఉత్పత్తులు ఎప్పుడూ కూడా సరిపడా తీసుకుంటూ ఉండాలి.


అలాగే గుండె ఆరోగ్యాన్ని మెగ్నీషియం మెరుగుపరచడంతో పాటు భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇది స్త్రీల నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. కండరాల బలహీనతను కూడా త్వరగా తొలగిస్తుంది. కాబట్టి మెగ్నీషియంతో కూడిన అరటిపండ్లు, అవకాడొ, పాలకూర, గుమ్మడి విత్తనాలు, సబ్జా గింజలు, బాదం, జీడిపప్పు ఇంకా అలాగే సోయా ఎక్కువగా తింటూ ఉండాలి.చర్మం, వెంట్రుకలు ఇంకా అలాగే గోళ్ల ఆరోగ్యానికి ఇంకా నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ వ్యవస్థ, గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా అలాగే మెటబాలిజం సమర్ధంగా ఉండాలన్నా బయోటిన్‌ సమృద్ధిగా ఉండే గుడ్లు, చిక్కుళ్లు, నట్స్‌, సీడ్స్‌, చిలకడ దుంపలు ఇంకా అలాగే మష్రూమ్స్‌ ఎక్కువగా తింటూ ఉండాలి.ఇంకా కండరాల పనితీరును క్రమపరిచే ఐరన్‌ లోపం ఏర్పడకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు ఇంకా మాంసాహారం ఖచ్చితంగా సరిపడా తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: