తొడ కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
కొంతమందికి సడెన్ గా తొడ కండరాలు పట్టేస్తాయి. చాలా మందికి బైక్ పై కూర్చునేటప్పుడు ఈ సమస్య వస్తుంది. అప్పుడు వారి బాధ, నొప్పి వర్ణనాతీతం. అలాగే వయస్సు మీద పడడం, అనారోగ్యాలు ఉండడం, వ్యాయామం చేస్తున్నప్పుడు, క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల కూడా తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటాయి. సాధారణంగా చాలా మందికి నిద్రలో కూడా ఇలా జరుగుతుంది. ఇక కొందరికైతే రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ సమస్య వస్తుంటుంది.అలాంటి సమయాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది.కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి. అలాంటప్పుడు తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది.


కనుక వైద్య పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. దీంతో కండరాలు లేదా పిక్కలు పట్టేయడం అన్న సమస్య తగ్గుతుంది. సమస్య నుంచి బయట పడవచ్చు.తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి తగ్గుతుంది. కొబ్బరినూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి బయట పడవచ్చు.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: