కిడ్స్ స్టోరీ : నలుగురు ఫ్రెండ్స్... అబద్దం పరిణామం
టీచర్ వాళ్ళ మాట విని బాగా అలోచించి "మీరు రేపు పరీక్ష రాయవచ్చు" అని చెప్పారు. ఇది విన్న నలుగురూ చాలా సంతోషించారు. టీచర్ కు వాళ్ళు అబద్ధం చెబుతున్నట్టుగా అర్థమైంది. మరోవైపు ఆ నలుగురు ఇంటికి వెళ్లి చదువుకోవడం ప్రారంభించాడు. రెండో రోజు పరీక్ష రాయడానికి నలుగురూ వచ్చారు. ఉపాధ్యాయులు వారిని వివిధ తరగతి గదుల్లో కూర్చోబెట్టారు. చేతికి ప్రశ్న పత్రం ఇచ్చారు. ఆ ప్రశ్నల పత్రంలో ఆశ్చర్యకరంగా కేవలం 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి.
అందులో మొదటి ప్రశ్న మీ పేరు ఏమిటి ?
రెండవది ఏ కారు టైరు పంక్చర్ అయింది?
రెండవ ప్రశ్నకు నలుగురూ నాలుగు రకాల సమాధానం రాశారు. వాళ్ళు చెప్పింది అబద్ధం కాబట్టి నలుగురి సమాధానాలు భిన్నంగా ఉన్నాయి. ఈ విధంగా టీచర్ వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు నిరూపించింది. అసలు విషయం బయటకు తెలియడంతో వాళ్ళ పేరెంట్స్, క్లాస్ మేట్స్ దగ్గర తల దించుకోవాల్సి వచ్చింది వారికి.
మోరల్ : జల్సాల కోసం చదువుని అశ్రద్ధ చేయొద్దు... అబద్దాల పరిణామం ఇలాగే నలుగురిలో పరువు పోయేలా ఉంటుంది.