బుడుగు: పిల్లలు తింటే అధిక బరువు పెరుగుతారంట..!
ఇక పిల్లలకు చిన్నతనం నుండి అధిక కెలోరీలు ఉన్న ఆహారం, నూనె పదార్థాలు, స్వీట్స్, జంక్ ఫుడ్స్ ని ఎక్కవగా పెడుతుంటారు. వాటిని తినడం వలన పదిహేనేళ్లలోపు పిల్లలలో అధిక బరువు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అది అలాగే కొనసాగితే యుక్త వయసులో కూడా అధిక బరువు, ఊబకాయం సమస్యలు ఎదురవుతాయని అన్నారు.
అయితే వారికీ జంక్ ఫుడ్స్కి బదులుగా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ, బాదం, ఆక్రోట్, వేరుశెనగ, వేయించిన శనగలు, బఠాణి లాంటి గింజలు, మొలకలు, ఉడికించిన గింజలు, మొక్కజొన్నలు మొదలైనవి స్నాక్స్గా అలవాటు చేయాలని తెలిపారు. ఇక వీటితో పాటు వివిధ రకాల చాట్స్, సలాడ్లు, టిక్కీలు, కట్లెట్స్ చేయవచ్చు నాని అన్నారు. అంతేకాక చపాతీలో గుడ్డు, పనీర్, చికెన్ లాంటివి చేర్చి రోల్స్ చేయాలన్నారు. ఆలా పిల్లలు ఇష్టపడేలా తయారు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాక.. వీటి వల్ల ఆకలి తీరడమే కాకుండా పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలని సంవృద్ధిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇళ్లలో చేసినవైనా, బయటి నుండి తెచ్చినవైనా స్వీట్లు, నూనెలో వేయించిన పిండివంటలు, బిస్కెట్లు, చాక్ లెట్లు, బేకరీ ఫుడ్స్ వీలైనంత తక్కువగా పిల్లలకు ఇవ్వాలని అన్నారు. ఈ చిరుతిళ్ళ వల్ల ఆరోగ్యానికి హానిచేసే సాచురేటెడ్ కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక కెలోరీలు శరీరంలో చేరుతుందని తెలిపారు. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.