బుడుగు: ఆ వయస్సు పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగం హానికరం..!?

N.ANJI
నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మొబైల్ ఫోన్ కి బానిసలైయ్యారు. రెండేళ్లు కూడా నిండని వారికి కూడా సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసనపరులుగా అవుతున్నారు. అయితే కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకై ఇవ్వాలని ఐ.టీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయేవిధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
ఇక ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్‌ ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియాపై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తేవద్దని జూహీ కౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్‌లలో అనవసరం, ఎప్పుడూ ఉపయోగించని యాప్‌లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు.
అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యాపరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా
ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతిరోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.డీ. విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడువేలమంది విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: