ఆగస్టు 17 - చరిత్రలో ఈరోజు ముఖ్య సంఘటనలు

MOHAN BABU
1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశంలోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడాలి. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
             
                       జననాలు
1866: మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911)
1908: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
(మ.1966)
1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985)
1939: మోదడుగు విజయ్‌ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
1962: మాకినీడి సూర్య భాస్కర్, ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త
1964: ఎస్.శంకర్, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.
     
                    *మరణాలు*
1786 : ఫ్రెడరిక్  లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
1817: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు (జ.1761)
1955: సాహీతీ వి'శారద', ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924)
1980: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909)
1997:ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925)
2007: దశరథ్‌ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
2015: ముద్దం శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు, మాజీ ఎంపీటీసీ, అమ్మపురం గ్రామం, తోర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: