జులై 7: చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే....

Purushottham Vinay
చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనలు చూసినట్లయితే... 1890 వ సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడటం జరిగింది.ఇక అలాగే 1929 వ సంవత్సరంలో వాటికన్ సిటీని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేయడం జరిగింది.1941వ సంవత్సరంలో అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.1985 వ సంవత్సరంలో బోరిస్ బెకర్ అతి పిన్న వయసులోనే తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.ఇక 1985 వ సంవత్సరంలో రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్పడిన జింబాబ్వేకి అధ్యక్షుడు అవ్వడం జరిగింది.1896వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించడం జరిగింది.ఇక 2005 వ సంవత్సరంలో లండన్ దేశంలో వరుస బాంబు పేలుళ్ళు జరిగాయి. ఆ పేలుల్లో 30 మంది చనిపోగా, 700 మంది గాయాలపాలయ్యారు.

ఇక చరిత్రలో ఈరోజు జరిగిన  ప్రముఖుల జాననాలు చూసుకున్నట్లయితే..1900 వ సంవత్సరంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి కళా వెంకటరావు జన్మించారు.1901 వ సంవత్సరంలో విట్టొరియో డి సికా అనే ఇటాలియన్ దర్శకుడు ఇంకా నటుడు జన్మించారు.1908 వ సంవత్సరంలో కొమ్మూరి పద్మావతీదేవి జన్మించారు. ఈమె తెలుగులో తొలితరం రంగస్థల నటి అలాగే మంచి కథా రచయిత్రి.1915వ సంవత్సరంలో యూల్ బ్రిన్నర్ అనే ప్రముఖ అమెరికన్ సినీ నటుడు జన్మించారు.ఇక 1916 వ సంవత్సరంలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అనే నటుడు ఇంకా రచయిత జన్మించారు.ఇక 1920 వ సంవత్సరంలో మద్దిపట్ల సూరి అనే రచయిత ఇంకా అనువాదకుడు అలాగే గొప్ప సాహితీవేత్త జన్మించారు.1922 వ సంవత్సరంలో పియరీ కార్డిన్ అనే మంచి ఫ్రెంచి ఫేషన్ డిజైనర్ జన్మించారు.

ఇక చరిత్రలో ఈరోజు జరిగిన ప్రముఖుల మరణాలు చూసినట్లయితే..1816 వ సంవత్సరంలో రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ అనే ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి ఇంకా నాటక రచయిత మరణించారు.ఇక 2008 వ సంవత్సరంలో వాడపల్లి వెంకటేశ్వరరావు అనే దౌత్యవేత్త ఇంకా కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: