కడుపులో మంట చిటికెలో తగ్గాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay

సాధారణంగా కడుపులో మంట మనం తీసుకునే ఆహారాల వల్లే ఎక్కువగా వస్తుంది. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం లేదా పులుపు ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే అసిడిటీ వస్తుంది. అలాగే టీ, కాఫీ ఎక్కువగా తాగినా, వీటిని ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగినా కూడా అసిడిటీ వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు మనకు కొన్ని చిట్కాలు బాగా పని చేస్తాయి. అవేమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కొత్తిమీర ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతున్నా కూడా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర జీర్ణ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ఇది అజీర్తి, గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల కొత్తిమీర నీళ్లను కూడా తాగవచ్చు.కడుపులో మంట  ఉన్నవారు 4-5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. అనంతరం గోరు వెచ్చని నీళ్లను తాగాలి. 


దీంతో పొట్టకు రెస్ట్ లభిస్తుంది. వెంటనే రీఫ్రెష్ అయినట్లు ఫీలవుతారు. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు గింజలతో తయారు చేసిన డికాషన్‌ను తాగడం వల్ల కూడా కడుపులో మంట నుంచి బయట పడవచ్చు. సోంపు గింజలను నీళ్లలో వేసి మరిగించి నీరు రంగు మారగానే వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ నీళ్లను రాత్రి తాగితే నిద్ర చక్కగా పడుతుంది.ఇంకా అలాగే జీలకర్ర నీళ్లను తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. జీలకర్ర నీళ్లను తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు. ఇందుకు గాను ఒకపాత్రలో నీళ్లను తీసుకుని అందులో జీలకర్ర ఒక టీస్పూన్ వేసి మరిగించాలి. నీళ్లు రంగు మారే వరకు మరిగించిన తరువాత నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో కడుపులో మంట నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. కడుపులో మంట చాలా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: