మధుమేహన్ని పోగొట్టే ఈజీ టిప్స్?

Purushottham Vinay
నవంబర్‌ 14 వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకొంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం మధుమేహం కారణంగా ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది రోగులు మరణిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం కూడా చాలా అవసరం.అందుకే ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధిని నివారించడానికి జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారం ఇంకా అలాగే శారీరక శ్రమ చాలా ముఖ్యం.ప్రపంచ ఆరోగ్య సంస్థ సపోర్ట్ తో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, ఇక 2006 నుండి అధికారికంగా పాటిస్తున్నారు.మధుమేహంతో బాధపడుతున్నవారు కొన్నింటిని తీసుకోవడం వల్ల అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.డ్రై ఫ్రూట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా అలాగే మధుమేహం వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.


అలాగే మీ ఆహారంలో బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలు చేర్చుకోండి.ఇంకా మీ బ్లడ్ షుగర్ పెరగకుండా నిరోధిస్తుంది. తృణధాన్యాలు B విటమిన్లు, ఇనుము ఇంకా ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి.ఇంకా చియా విత్తనాలు బరువు తగ్గడంలో సహాయపడే ప్రభావవంతమైన సూపర్‌ఫుడ్‌గా ఉంటాయి. చియా విత్తనాలు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఇంకా అలాగే ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు మధుమేహం ఇంకా అలాగే దాని సంబంధిత సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.మీకు మధుమేహం కనుక ఉంటే మీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్‌ఎస్‌పిహెచ్) పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పెరుగు తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు ఈజీగా తగ్గుతుందని తేలింది. ఇందులో క్యాల్షియం ఇంకా ప్రొటీన్లు కూడా చాలా పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: