రోజు ఈ పండు తింటే ఎలాంటి రోగాలు రావు?

Purushottham Vinay
ఇక సీజనల్ వ్యాధులను తట్టుకోవాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే, ఈ వర్షాకాలంలో సీజనల్ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి కివి పండును తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కివి పండులో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా డెంగ్యూ రోగుల్లో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో కివి పండు చాలా అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. కివి లో రోగ నిరోధక శక్తిని పెంచే విలువైన పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ల కొరతను అధిగమించడంలో కివి పండు చాలా అద్భుతంగా పని చేస్తుంది.ఇక కివీ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివి పండును రోజూ ఒకటి తినడం వలన శరీరానికి బాగా అవసరమైన సి విటమిన్‌ను అందిస్తుంది. ఇది పీచు పదార్థం ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కివిలో ఉండే విటమిన్ సి కంటెంట్.. నారింజ ఇంకా నిమ్మకాలయ కంటే రెట్టింపు ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సితో పాటు, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.

కివీపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ కివి పండులో విటమిన్ ఇ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కివి పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చెడు కొవ్వు కారణంగా ధమనులు మూసుకుపోకుండా కూడా కాపాడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. మంచి శరీరాకృతిని ఇంకా మెరుపును కూడా అందిస్తుంది.కివిలో విటమిన్ కె ఇంకా విటమిన్ ఎ కూడా ఉన్నాయి.ఆరోగ్యకరమైన కెరోటినాయిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా కివిలో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం ఇంకా బరువు పెరుగకుండా సహకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: