వర్షాకాలం రోగాలు రాకుండా ఈ పండ్లు తినండి?

Purushottham Vinay
ప్రస్తుతం వర్షాలు బాగా దంచి కొడుతున్నాయి. వర్షాకాలం చల్లటి వాతావరణంతో పాటు వ్యాధులను సైతం తీసుకొస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాతావరణంలో ఒక్కసారిగా జరిగే మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.ఇక జలుబు నుంచి మొదలు జ్వరం వరకు వేధిస్తుంటాయి. అయితే మారిన కాలంతో వచ్చే వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే కచ్చితంగా మనలో రోగ నిరోధశక్తి అనేది చాలా బలంగా ఉండాలి. అలా అయితేనే ఇక వ్యాధులను తట్టుకునే శక్తి మనకు వస్తుంది. మరి వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు మాత్రమే కాదు, కొన్ని రకాల పండ్లను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ వర్షాకాలంలో ప్రత్యేకంగా లభించే నేరేడు పండ్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులోని పోషకగుణాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లలో ఐరన్‌, క్యాల్షియం ఇంకా విటమిన్‌ సీలు పుష్కలంగా ఉంటాయి.అంతేకాకుండా ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మారడంలో ఉపయోగపడతాయి.


ఇక కాలంతో సంబంధం లేకుండా లభించే యాపిల్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్‌లో ఉండే విటమిన్‌ సీతో పాటు క్వెర్సెటిన్ అనే ఫ్లవనాయిడ్స్‌ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి.ఇక దానిమ్మను ఇష్టపడని వారు ఉండరు. రుచికి కేరాఫ్‌గా నిలిచే ఈ ఫ్రూట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా దానిమ్మ ఒక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్‌ బీ6 రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడంలో మంచి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక కాలంతో సంబంధం లేకుండా లభించే ఈ పండును ప్రతీ ఒక్కరూ కూడా మీ డైట్‌లో భాగం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: