జంతువులతో సోకుతున్న ప్రమాదకరమైన వ్యాధి ఇదే..!!

Divya
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పశుపోషణ పైన తాజాగా దృష్టి పెడుతోంది.. కానీ పశువులు రోగాల బారిన పడకుండా ఉంటేనే పశుపోషణ చాలా బాగుంటుంది లేదంటే సంపాదన మొత్తం వైద్యానికి ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో జంతువులలో హేమ రేజిక్, సెప్టిసీమియా అనే ఒక ప్రమాదకరమైన వ్యాధి సోకుతున్నది.. జంతువులను ఈ వ్యాధి నుంచి రక్షించడం చాలా ముఖ్యము. దీని కారణంగా జంతువులు అకాలంగా మరణిస్తున్నాయట. వర్షాకాలంలో ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇక ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం టీకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది దేశంలో పాల ఉత్పత్తిలో ఏటా దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందట. ఇలాంటి పరిస్థితులలో పశుపోషణ మనకి ఎంతో చాలా ముఖ్యము. ఈ వ్యాధి నుంచి జంతువులను ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు చూద్దాం. గల్గోటు ఈ వ్యాధి ప్రధానంగా గేదెలకు ఆవులకు మాత్రమే సంభవిస్తున్నది. ఈ వ్యాధి ఈ నెల నుండి జూన్ నెల వరకు సోకుతుంది. ఇది జంతువులకు సంభవించే ఒక అంటువ్యాధి ఇది బ్యాక్టీరియా ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి లక్షణాలు చికిత్స గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ వ్యాధి వల్ల అధిక జ్వరం 105 నుండి 106°F  వరకు వస్తుంది కళ్ళు కూడా ఎర్రబడి నట్లు వాచిపోవడం ముక్కు కళ్ళు నుండి.. ద్రవం వంటివి కారణం మెడ తల మీద కాళ్ల మధ్య వాపు ఉండడం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా శబ్దం రావడం వంటివి వ్యాధి లక్షణాలు అని చెప్పవచ్చు.
ఈ వ్యాధికి తక్షణ చికిత్స చేయకపోతే జంతువులు మరణిస్తాయి దీనిని సమీపంలో ఉండే పశు వైద్యశాలకు తరలించి వెంటనే చికిత్స అందించాలి ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే ఈ వ్యాధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా వేస్తూ ఉండాలి. ఈ వ్యాధి లక్షణాలు చూసినప్పుడు అనారోగ్య జంతువును ఇతర ఆరోగ్యకరమైన జంతువుల వద్ద కట్టి వేయకూడదు. ముఖ్యంగా వీటిని ఎక్కడికి తిప్పకుండా ఉంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: