వేసవి కాలం: ఇలా చెయ్యకపోతే "యమ డేంజర్"... ?

VAMSI
వేసవి కాలం వచ్చేసింది, ఎండలు భగ భగ మండిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఈ ఎండాకాలంలో మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు మరియు వృద్ధులు వేసవి కాలంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. చిన్నారులు ఎక్కువగా నీటిని తాగరు, వారికి దాహం వేసినా చెప్పడం తెలియకో లేదా వారికి దాహం అనే విషయం సరిగా అర్దం కాకో చెప్పకుండా ఉండిపోతారు. అయితే తల్లి తండ్రులే వారిని ఒక కంట కనిపెడుతూ నీరు తాగిస్తూ ఉండాలి. కొందరు పెద్దలు భోజనం చేసినప్పుడో లేదా ఏదైనా తినిపించినప్పుడు మాత్రమే నీటిని త్రాగించడం కాదు మధ్య మద్య లోనూ పిల్లలకు నీటిని తాగిస్తూ ఉండాలి. అదే విధంగా పెద్దలు కూడా ఎక్కువ గా నీరు త్రాగాలి.

ఇపుడు వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను గురించి తెలుసుకుందాం.

* నీటిని పుష్కలంగా తాగాలి. రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల వరకు నీరు త్రాగాలి.

* శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటిని అందు లోనూ ఓవర్ కూల్ గా ఉండే నీటిని తాగకండి.

* సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని లేదా కుండలో ఉన్న నీటిని తాగడం శ్రేయస్కరం.

* బయట పనుల మీద వెళ్ళే వారు తమతో ఒక వాటర్ బాటిల్ ను తీసుకు వెళ్ళండి.

* వేసవి కాలంలో ఎక్కువగా పండ్లను తినటం మంచిది. అలాగే మసాలా వంటలను తినడం తగ్గించాలి.

* స్నానానికి చల్లటి లేదా గోరు వెచ్చటి నీటిని మాత్రమే వినియోగించాలి. వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయరాదు.

* వేసవి కాలంలో మరి నీరసం వచ్చి అలసి పోయేలా వ్యాయామం చేయరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: