ఈ పండుతో ఖర్చు తక్కువ.. ఆయుష్యు ఎక్కువ.. ఎలాగంటే..?
జామపండు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం.. జామ పండు తినడం వల్ల.. దంతాలకు బలం చేకూరడమే కాకుండా చిగుళ్లవాపు, చిగుళ్ల నొప్పి , నోటి పూత, గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఇలా అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా నోటి పూత ఎక్కువై బాధపడుతున్నవారికి జామ ఆకులు నమలడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.. నాలుగు లేదా ఐదు జామ ఆకులను తీసుకుని వేడి నీటిలో బాగా మరిగించి..చల్లార్చి.. వడగట్టుకుని ఆ నీటిని తాగడం వల్ల జలుబు వల్ల వచ్చే సమస్యలు దూరం అవుతాయి.. ఈ కషాయం సేవించడం వల్ల నడుము నొప్పి సైతం పరార్ అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
జామకాయలు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి..జామ ఆకు తో తయారు చేసిన కషాయం తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుంది. అంతేకాదు ఈ కషాయంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా తగ్గుతుంది. అనుకోని పరిస్థితుల్లో క్యాన్సర్ కారక వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ కషాయం లో ఉండే యాంటీబయోటిక్స్ వైరస్ తో పోరాడి మనకు క్యాన్సర్ రాకుండా సహాయపడతాయి. జామ పండు తినడం వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెంది.. అన్ని అవయవాలకు చక్కగా రక్తం సరఫరా అయ్యేలా సహాయపడుతుంది.