
గర్భంలోనే కరోనా సోకితే వచ్చే అరుదైన సమస్య .. !
చిన్నారికి కూడా కరోనా పరిక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో యాంటీ బాడీస్ని కూడా గుర్తించారు. దాంతో లక్షణాలు లేకుండానే తల్లికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, ఆమె కోలుకోవడంతో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లి ద్వారా శిశువుకి కూడా యాంటీ బాడీస్ చేరినట్లు గుర్తించారు. దాంతో చిన్నారికి నియో నేటల్ కేర్లో ఉంచి చికిత్స అందించారు. దాంతో ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ మాట్లాడుతూ....అప్పుడే పుట్టిన పిల్లల్లో చర్మానికి గాయాలు ఏర్పడడం అరుదైన విషయమని చెప్పారు. ఇలాంటి స్థితిని వైద్య పరిభాషలో 'నియోనేటల్ పర్పురా ఫుల్మినన్స్' అంటారని తెలిపారు. అంతే కాకుండా దీనిని పిల్లలలో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని పిలిచే కోవిడ్ సమస్య గా గుర్తించారు. ఈ సమస్య వచ్చిన పిల్లల్లో వాంతులు, విరేచనాలు, చర్మంపై కమిలిన గాయాలు కనిపిస్తాయని తెలిపారు.