ఆస్తులు అమ్ముకుంటున్న కాజోల్.. ఏం జరిగిందంటే..?

frame ఆస్తులు అమ్ముకుంటున్న కాజోల్.. ఏం జరిగిందంటే..?

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజోల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్నో యూత్ అట్రాక్షన్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. ఆ తర్వాత సినిమాలకు కొంత మేరకు దూరంగా ఉన్న మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి తిరిగి మళ్ళీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా నటిస్తున్నది.. అటు ఒకవైపు భర్త , ఇటు కాజోల్ ఇద్దరూ కూడా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు.


ఇక కాజోల్ తను సంపాదించిన డబ్బులు అన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్ మీదే పెట్టుబడులు పెడుతూ ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే తాను సంపాదించిన వాటిలో ఒక లగ్జరీ ప్లాటును కాజోల్ అమ్మేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో పోవైలోని హిరానందిని గార్డెన్ లో ఉన్నటువంటి ఒక లగ్జరీ ప్లాట్ రూ.3.1 కోట్ల రూపాయలకు 762 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ ను అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇరవై ఒక్క అంతస్తులలో ఈ ఫ్లాట్ కలిగి ఉన్నదట. ఈనెల 20వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాజల్ ఒక ఆఫీస్ స్పేస్ ను సైతం కొనుగోలు చేయడంతో అందుకు కాజోల్ కు 27 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా.. అందుకోసమే ఈమె ఇలా ఫ్లాట్ ని అమ్మినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కాజోల్ చాలా అనే ఆఫీసు స్పేస్ బిల్డింగులను సైతం కొని మరి అద్దెకు ఇస్తూ అలా కూడా భారీగానే సంపాదిస్తూ ఉన్నదట కాజోల్ ఇలా రియల్ ఎస్టేట్లో కూడా తన హవా కొనసాగిస్తున్నదట. మొత్తానికి మరొకసారి ఇలా తన ఆస్తిని ఆమె వార్తలలో నిలుస్తోంది కాజోల్ మరి రాబోయే రోజుల్లో తన నటనతో మరింత మెప్పిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: