కని "కరోనా": కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులు.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుందా..?

Suma Kallamadi
కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులు ఫస్ట్ mRNA(ఎంఆర్ఎన్ఎ) వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత బలమైన యాంటీబాడీస్ పొందారని.. కానీ సెకండ్ డోస్ తర్వాత తక్కువ స్థాయిలో యాంటీబాడీస్ ఉత్పన్నం అయ్యాయని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. పెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ చేసిన పరిశోధనలలో ఈ విషయం బయటపడింది. అయితే ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను సైన్స్ ఇమ్యునాలజీలో ప్రచురించారు. అయితే అధ్యయనం చేసిన పరిశోధకులు మాట్లాడుతూ ఆల్రెడీ కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తులు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే వారి శరీరంలో అవసరమైన యాంటీబాడీస్ ఉత్పన్నమవుతాయని.. దీంతో 2వ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.


అయితే గతంలో ఒక్కసారి కూడా కరోనా వైరస్ బారిన పడని వ్యక్తులు ఖచ్చితంగా మొదటి డోస్ తో పాటు సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. అప్పుడే శరీరంలో కరోనా వైరస్ ని ఎదుర్కోగల యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయి. ఈ పరిశోధన వల్ల ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ గురించి మరింత సమాచారం తెలుసుకున్నట్లు అయ్యిందని.. ఈ పరిశోధన వల్ల ఇతర వ్యాక్సిన్లు కూడా సమర్థవంతంగా తయారు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.



"ఈ ఫలితాలు స్వల్ప, దీర్ఘకాలిక వ్యాక్సిన్ సమర్థతకు ఉపయోగపడతాయాని.. ప్రస్తుత పరిశోధన మెమరీ బి కణాల విశ్లేషణ ద్వారా ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ రోగనిరోధకత గురించి అవగాహన కల్పించడం లో  తోడ్పడుతుంది" అని పెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ డైరెక్టర్ ఇ. జాన్ వెర్రీ చెప్పుకొచ్చారు.



సాధారణంగా వ్యాక్సిన్లు, ఇన్ఫెక్షన్లకు మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి రెండు ప్రధాన ఫలితాలకు దారితీస్తుంది. ఒకటే ఏంటంటే.. వేగవంతమైన రోగనిరోధక శక్తిని అందించే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. మరొకటి ఏంటంటే.. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి పెరిగేందుకు సహాయపడే మెమరీ బి కణాల తయారవుతాయి. ఐతే ఈ అధ్యయనం లో కోవిడ్ -19 లేని వారితో పోలిస్తే, గతంలో కరోనా బారినపడిన వ్యక్తులలో టీకా వేసిన తర్వాత మెమరీ బి కణాల స్పందనలు ఎలా భిన్నంగా ఉంటాయో పరిశోదకులు పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: