కొందరు ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తుంటారు. భూమి భారమంతా తమ నెత్తిననే మోస్తున్నట్లు నిస్సత్తువగా ఉంటారు. ఆహారంలో తీసుకోవడం బాగానే ఉన్నా వారిలో నీరసం మాత్రం తగ్గదు. ఇందుకు కారణం కొన్ని రకాల విటమిన్స్ లోపించడమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. అనేక అధ్యాయనాల ఫలితంగా కొద్దిపాటి పనులకే నీరసం, నిస్సత్తువగా అనిపించే అయ్యేవారిలో విటమిన్ బి12, విటమిన్ డి లోపం ఉంటుందని స్పష్టమైంది.
విటమిన్ బి12:
మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. వీటి నివారణకు జాగ్రత్తలు వహించాలి..
- ఆహారం పదార్థాల్లో కేవలం మాంసంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది.
- శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవాలి.
- చేపలు, షెల్ఫిష్లో కూడా ఎక్కువగానే ఉంటుంది.
విటమిన్ డి:
మానవుడి శరీరంలో డి విటమిన్ చేసేటువంటి మేలు నిజంగా ఎంతో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎముకలు ఆరోగ్యంగ ఉండటానికి సహకరిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా బలంగా ఉండేట్టు చేస్తుంది.. రక్తం లో ఉన్న నాళాలను కాపాడుతుంది. ఇది లోపిస్తే ఎముకల, కండరాల పటుత్వం తగ్గి.. నీరసానికి దారితీస్తుంది.
- డి విటమిన్ సాల్మన్, ట్యునా, మెకరెల్ చేపలు, పాలు, తృణ ధాన్యాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్, పుట్ట గొడుగుల్లో పుష్కలంగా లభిస్తుంది.
- వీలైనంత వరకు సూర్యరశ్మి ఉన్న సమయంలో ఎండకు కాసేపు నిలబడటం మంచిది.