గ్యాస్, ఎసిడిటీని నిమిషంలో మాయం చేసే చిట్కా?

Purushottham Vinay
మనం ఎలాంటి మందులు వాడే పని లేకుండా సహజ సిద్ద చిట్కాను ఉపయోగించి  చాలా ఈజీగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.ఈ టిప్ ని తయారు చేసుకోవడం ఇంకా అలాగే వాడడం కూడా చాలా సులభం.ఈ టిప్ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేసే ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి ఇంకా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 4 మిరియాలను, 4 లవంగాలను ఇంకా చిటికెడు పసుపును వేయాలి. ఆ తరువాత ఈ నీటిని స్టవ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఆ తరువాత దీనిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి.


ఇక ఈ కషాయాన్ని రోజుకు ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవచ్చు.ఇంకా అలాగే దీనిని ఎవరైనా కూడా తీసుకోవచ్చు.ఇక ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్య తలెత్తిన వెంటనే ఈ కషాయన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఖచ్చితంగా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపు ఉబ్బరం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్ అలాగే ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: