సమ్మర్లో తినాల్సినవి ఇంకా తినకూడనివి ఇవే?

Purushottham Vinay
మన శరీరాన్ని ఎప్పుడూ ఖచ్చితంగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఎండాకాలంలో మనం తీసుకొనే ఆహారం కూడా ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు వంటివి తగినంత నీరు ఇంకా పోషకాలతో నిండి ఉంటాయి.వేడి వాతావరణాన్ని అధిగమించడానికి ఇవి మనకు ఖచ్చితంగా సాయపడతాయి. పుచ్చకాయ, సీతాఫలం, కీరదోస, స్ట్రాబెర్రీలు, పాలకూర ఇంకా బచ్చలికూర వంటివి తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. వీటితో పాటు, కొబ్బరి నీరు, ఐస్‌డ్ టీ ఇంకా నిమ్మరసం వంటి హైడ్రేటింగ్ పానీయాలు ట్రై చెయ్యండి. ఇంకా అలాగే కొన్ని పదార్థాలు వేడి వాతావరణంలో తినకూడనివి కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎండ వాతావరణంలో తినవలసినవి.. తినకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..పెరుగు, దోసకాయ, ఇతర కూరగాయలతో తయారు చేసే ప్రసిద్ధ సైడ్ డిష్ రైతా. ఇది శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. ఇంకా అలాగే చాలా రిఫ్రెష్‌గా కూడా ఉంచుతుంది.


మజ్జిగకి మన భారతదేశంలో ప్రసిద్ధ వేసవి పానీయంగా పేరుంది. ఇది మన శరీరాన్ని ఖచ్చితంగా చల్లబరుస్తుంది.వేసవి కాలంలో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో మామిడిపండ్లు, పుచ్చకాయలు ఇంకా సీతాఫలాలు లిచీలు తీసుకోవచ్చు.ఇక స్పైసీ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా మీకు చెమట పట్టేలా చేస్తాయి. దాని ఫలితంగా మీ శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. అందువల్ల వేడి వాతావరణంలో మరింత వేడిగా అనిపించేలా చేస్తాయి.అలాగే కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది మీ శరీర ఉష్ణోగ్రతను త్వరగా పెంచుతుంది. ఫలితంగా వేడి వాతావరణంలో మీకు బాగా నీరసంగా అనిపించవచ్చు.అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడియం అధికంగా ఉండేవి డీహైడ్రేషన్ ఇంకా నీరు నిలుపుదలకి ఖచ్చితంగా దారి తీయవచ్చు. అవి ఈ వేడి వాతావరణంలో ఇవి మీకు మరింత అసౌకర్యాన్ని కల్పిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: