కిడ్నీలని క్లీన్ చేసి హెల్తీగా ఉంచే డ్రింక్ ఇదే?

Purushottham Vinay
మనకు మన వంటింట్లో దొరికే పదార్థాలతో ఒక చక్కటి డ్రింక్ ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలు చాలా సులభంగా శుభ్రపడతాయి. మూత్రపిండాలు మన శరీరంలో ఉండే మలినాలను వడపోసి మన శరీరాన్ని ఎల్లప్పుడూ బాగా శుభ్రంగా ఉంచుతాయి.అయితే చాలా మంది కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ వీటిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. మూత్రపిండాల్లో మలినాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం ఖచ్చితంగా చాలా దెబ్బతింటుంది. అందువల్ల రక్తం పూర్తిగా శుభ్రమవ్వదు. దీని వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ లు రావడం, మూత్రంలో మంట, మూత్రం తరచూ వస్తున్నట్టు ఉండడం ఇంకా అలాగే మూత్రపిండాలు ఉన్న భాగంలో నొప్పి రావడం, వాంతులు ఇంకా తరచూ జ్వరం రావడం వంటి ఇతర సమస్యలు కూడా ఈజీగా తలెత్తుతాయి.మన మూత్రపిండాలను శుభ్రపరచడంలో ధనియాలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే దీనిలో పాటు మనం జీలకర్రను ఇంకా ఒక నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ధనియాలను రోట్లో వేసి వాటిని కచ్చా పచ్చాగా దంచుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో నిండుగా నీటిని పోసి రెండు గంటల పాటు వాటిని నానబెట్టుకోవాలి. దీని వల్ల ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు ఈజీగా నీటిలోకి వస్తాయి.ఆ తరువాత ఈ నీటిని గిన్నెలో పోసి చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి.ఇక ఇలా వేడి చేసిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇంకా అలాగే నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత ఈ నీటిని మరో 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో రుచి కోసం తేనెను కూడా వేసుకోవచ్చు. అయితే దీనిని మాత్రం గోరు వెచ్చగా  తీసుకోవాలి. ఇంకా అలాగే రోజులో ఎప్పుడైనా దీనిని తీసుకోవచ్చు. ఇలా డ్రింక్ ని తయారు చేసి తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఈజీగా శుభ్రపడతాయి. మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు కూడా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: