కీళ్ళ నొప్పులు, శబ్దాలను తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది కూడా అసలు వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రావడం, క్యాల్షియం లోపం ఇంకా ఎముకలు బలహీనంగా ఉండడం వంటి సమస్యలతో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు.అయితే ఈ నొప్పులను ఈజీగా తగ్గించి ఎముకలను ధృడంగా ఇంకా బలంగా మార్చే చక్కటి చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టిప్ కోసం నిమ్మకాయంత బెల్లాన్ని, అర కప్పు పుట్నాల పప్పును ఇంకా ఒక గ్లాస్ పాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు మీరు నల్ల రంగులో ఉండే బెల్లాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే బెల్లంలో అధిక మొత్తంలో ఫాస్పరస్ అనేది ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అదే విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్ని ఈజీగా తొలగిపోతాయి.


రక్తహీనత సమస్య కూడా ఇక మన దరి చేరుకుండా ఉంటుంది.అలాగే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటు కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా రోజూ పుట్నాల పప్పును, బెల్లాన్ని కలిపి తిని ఒక గ్లాస్ వేడి పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు అవి మరలా రాకుండా ఉంటాయి.ఈ టిప్ వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మోకాళ్ల నుండి శబ్దాలు రావడం కూడా ఈజీగా తగ్గుతుంది. అయితే వీటిని మధ్యాహ్నం భోజనం చేసిన రెండు గంటల తరువాత బెల్లాన్ని ఇంకా పుట్నాల పప్పును తిని పాలను తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనలనేవి మన దరి చేరకుండా ఉంటాయి. రోజంతా కూడా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఈ చిట్కా శరీరంలో హిమోగ్లోబిన్ శాతంని కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: