భోజనం చేసాక ఇలాంటి పనులు చేస్తే అంతే సంగతులు..!

Divya
మన దేశంలో ప్రతి పనికి ఒక పద్దతి,కొన్ని నియమాలు ఉంటాయి.అలానే భోజనం చేయడానికి ఎలా నియమాలు ఉన్నాయో,అలాగే భోజనం చేసాక కూడా కొన్ని పనులు చేయకూడదని వాటి వల్ల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయని హెచ్చరిస్తుంటారు.ఈ పనులు చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తి, అనేక అనారోగ్యాలకు దారితిస్తాయి.కావున భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
నిద్రపోవడం..
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల, శరీరం నిద్రావస్థకు వెళ్లి,జీర్ణక్రియ మందగిస్తుంది.దీనితో తిన్నది సరిగా అరగక,సరైనా పోషకాలు శరీరానికి అందక పోవడమే కాక,ఆజీర్తి,మలబద్ధకం,గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
పండ్లు తినడం..
తిన్న వెంటనే పండ్లను తీసుకోవడంతో,వీటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల ఇవి తొందరగా అరిగిపోతాయి.కానీ భోజనంలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నట్లయితే  అది అరగడానికి కనీసం 24 గంటల సమయం పడుతుంది.దీనితో జీర్ణక్రియ సక్రమంగా జరగక జీర్ణసమస్యలు మొదలవుతాయి.
టీ, కాపీలు తాగటం..
భోజనం చేసిన వెంటనే టీలు కాఫీలు తీసుకోవడం వల్ల,  అందులోని కేఫిన్ ఆహారాన్ని జీర్ణం కాకుండా చేయడమే కాక,ఆహారంలోని ఐరన్ కంటెంట్ ను శోషించుకోకుండా కూడా అడ్డుపడుతుంది.కావున భోజనం చేసిన తర్వాత టీ,కాఫీలు తీసుకోకపోవడమే చాలా మంచిది.
దూమపానం..
ఆహారం తీసుకున్న వెంటనే సిగరెట్, బీడీలు త్రాగటం వల్ల,ఇందులోని రసాయనాలతో పాటు, చెడ్డ వాయువులు కూడా అన్నవాహిక గుండా జీర్ణాశయంలోకీ చేరి,తిన్న భోజనం సరిగా జీర్ణమవకుండా అడ్డుపడుతుంది.దీనితో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్నానం చేయడం..
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల,శరీరం చల్లబడి జీర్ణక్రియ రేటు తగ్గుతుంది.మరియు శరీరానికి అందులోని పోషకాలు శోషించుకునే శక్తి కూడా మందగిస్తుంది.కావున తిన్న వెంటనే స్నానం చేయకపోవడం చాలా ఉత్తమం.
వాకింగ్ చేయడం..
ఆహారం తీసుకున్న వెంటనే నడవడం వల్ల,మన మెదడు నుంచి ఆహారం జీర్ణం అవ్వడానికి సంకేతాలు వెళ్లకుండా నడవడంపై దృష్టి పెడుతుంది.కాబట్టి జీర్ణక్రియ రేటు తగ్గుతుంది.కావున తిన్న అరగంట తర్వాత వాకింగ్ చేయడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: